పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక హెచ్చరికలు చేశారు. ఇరాన్ మళ్లీ ఖతార్పై దాడులు చేస్తే, అమెరికా కఠిన చర్యలకు వెనుకాడదని స్పష్టం చేశారు. అవసరమైతే ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడి చేయడానికీ వెనుకాడబోమని తెలిపారు. అయితే దీని వల్ల దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని, అందుకే తాను ఇలాంటి నిర్ణయాన్ని తప్పించుకోవాలని చూస్తున్నానని చెప్పారు.
ఇదిలా ఉండగా ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య దాడులు మరింత తీవ్రంగా మారాయి. ఇజ్రాయెల్ ఇరాన్కు చెందిన కీలక నాయకత్వంపై దాడులు చేస్తుండగా, ఇరాన్ ప్రతీకారంగా ఖతార్ గ్యాస్ సదుపాయాలపై క్షిపణి దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం ఇరాన్ ఎంబసీ అధికారులను 24 గంటల్లో దేశం విడిచిపోవాలని ఆదేశించింది.
అలాగే, యూఏఈలోని హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీ, బాబ్ ఆయిల్ ఫీల్డ్లపై కూడా ఇరాన్ దాడులు జరిపింది. దీనిని యూఏఈ తీవ్రంగా ఖండిస్తూ ప్రమాదకర పరిస్థితి అని పేర్కొంది. గల్ఫ్ దేశాలపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం పడింది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కట్టుదిట్టం చేయడంతో చమురు ధరలు 5 శాతం పెరిగి బ్యారెల్కు 108 డాలర్లకు చేరాయి.
Also Read:మళ్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా రోహిత్?
ఇదే సమయంలో ఖతార్ లోని రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్పై క్షిపణి దాడి జరగడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

