వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై వర్థమాన దర్శకుడు, స్పెషల్ మూవీ డైరెక్టర్ వాస్తవ్ మండిపడ్డారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదం మళ్లీ ఊపందుకొన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. వర్మ కెరీర్ మొదట్లో శివ, క్షణక్షణం అద్బుతమైన చిత్రాలు తీసి చాలా మంది యూత్ను దర్శత్వం వైపు రావటానికి మార్గం వేసిన గురువు అనుకుంటారు. అంతేకాదు వర్మ చేసిన చిత్రాలు చూసి ఇతను 20 సంవత్సరాల తరువాత టెర్మినేటర్ లాంటి గొప్ప చిత్రాలు చేస్తాడు అని అనుకునేవారు. కాని ఇప్పడు రామ్గోపాల్ వర్మ తీస్తున్న నాసిరకం చిత్రాలు ఆఫీసర్, లక్ష్మీస్ ఎన్ టి ఆర్, ఐస్క్రీమ్ లు చూస్తుంటే అభిమానులకి కోపం వస్తుంది.
రామ్గోపాల్ వర్మ చెప్పేది అంతా సొల్లు.. సొల్లు మాత్రమే.. చాలా మంది అతనికి పిచ్చి పట్టిందేమె అనుకుంటున్నారు. నేను స్పెషల్ చిత్రాన్ని తీసాను.. ఓక్క సారి నా చిత్రం చూసి అప్పుడు మాట్లాడు వర్మ. అంతేకాదు ఇటీవల మందు తాగి ఎవడో రాసిచ్చిన పాటని పాడి సోషల్ మీడియాలో పెట్టాడు. మినిమమ్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేస్తున్న నువ్వు శివ అనే ఛారిత్రాత్మక చిత్రాన్ని తీసావంటే నమ్మలేకున్నాము. నీలాంటి వాడిని నమ్మి నిర్మాతలు, నటీ, నటులు మోసపోతున్నారు అని తన సోషల్ మీడియాలో ద్వజమెత్తాడు స్పెషల్ చిత్రం దర్శకడు వాస్తవ్.