శ్రీవారి సేవలో గోపిచంద్..బాలయ్యతో సినిమా అనౌన్స్‌

76
gopichand
- Advertisement -

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ దర్శకుడు గోపీచంద్ మల్లినేని కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

గోపీచంద్ మాట్లాడుతూ….మా కులదైవం శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులు పొందడం చాల సంతోషమన్నారు. బాలయ్యతో ఈ మాసంలోనే సినిమా ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే పాండిచ్చేరి డిప్యూటీ స్పీకర్ రాజవేలు, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ తదితరులు స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించారు.

- Advertisement -