ప్రజలకు క్షమాపణ చెప్పిన సోమువీర్రాజు..

49
somu verraju
- Advertisement -

రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కడపలో ఎయిర్ పోర్ట్ పై సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం చెలరేగింది.కడప జిల్లాలో ఎయిర్ పోర్టా..? వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు అంటూ వీర్రాజు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై అన్నివర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే ఆయన క్షమాపణలు చెప్పారు. రాయలసీమ రతనాల సీమ ఈ పదం నా హృదయంలో పదిలం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు విమర్శించే క్రమంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలను వెనక్కి తీసుకుంటున్నాను. ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.

రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలనేదే బీజేపీ ఆలోచన అని తెలిపారు.

- Advertisement -