KKR టీమ్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన దినేశ్ కార్తీక్..

230
Dinesh Karthik
- Advertisement -

కేకేఆర్‌ టీమ్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు దినేశ్ కార్తీక్. కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.అయితే బ్యాటింగ్ పై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. జట్టుకు మరింతగా సేవలు అందించడమే తన ప్రాధాన్య అంశమని తెలిపాడు. ఈ క్రమంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని పగ్గాలను ఇయాన్ మోర్గాన్‌కు అప్పగించాడు. కొత్త కెప్టెన్ గా నియమితుడైన మోర్గాన్ కు కార్తీక్ శుభాకాంక్షలు తెలిపాడు. మోర్గాన్ నాయకత్వంలో కోల్ కతా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించాడు.

దినేశ్ కార్తీక్ నిర్ణయంపై కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సీఈఓ వెంకీ మైసూర్ ఓ ప్రకటనలో స్పందించారు. డీకే (దినేశ్ కార్తీక్) వంటి ముందుండి నడిపించే వ్యక్తులు జట్టులో ఉండడం తమ అదృష్టమని పేర్కొన్నారు. జట్టు ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని డీకే భావించేవాడని తెలిపారు. అతని నిర్ణయం తమను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని, ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం ఉండాలని అభిప్రాయపడ్డారు.

కాగా, ఐపీఎల్ తాజా సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మెరుగైన ఆటతీరుతో కొనసాగుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ టీమ్.. 4 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో 3 మ్యాచ్‌ల్లో పరాజయం పాలయింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు చేతిలో ఓడిపోగా.. హైదరాబాద్, రాజస్థాన్, చెన్నై, పంజాబ్ జట్లపై విజయం సాధించింది. నేడు అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో బలమైన ముంబయి ఇండియన్స్ తో తలపడనుంది.

- Advertisement -