Kejriwal:ఢిల్లీ హైకోర్టులో తీర్పు రిజర్వ్

33
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. కేజ్రీవాల్‌ తరఫున అభిషేక్‌ మను సింఘ్వీ, విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపింగా సీబీఐ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డీపీ సింగ్‌ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

ఇక రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 29న హైకోర్టు విచారణ జరగనుంది. మద్యం పాలసీ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ జూన్‌ 26న అరెస్టు చేసింది. అదే నెల 20న ట్రయల్‌ కోర్టు ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈడీ కేసులో సుప్రీంకోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇటీవల బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సీబీఐ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీపై తిహార్‌ జైలులో ఉన్నారు.

Also Read:విడుదల 2.. ఫస్ట్ లుక్

- Advertisement -