టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ..

189
dc
- Advertisement -

ఐపీఎల్‌-13 ‘క్వాలిఫయర్‌–2’ మ్యాచ్‌లో నేడు మరో కీలక పోరు జరగనుంది. అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. హైదరాబాద్ టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఢిల్లీలో రెండు మార్పులు చేశారు. పృథ్వీ షా స్థానంలో ప్రవీణ్ దుబే, డేనియల్ సామ్స్ స్థానంలో హెట్‌మెయిర్‌ను మళ్లీ టీమ్‌లోకి తీసుకున్నారు. మాజీ ఛాంపియన్‌ సన్‌రైజర్స్‌ రెండోసారి ఐపీఎల్‌ ఫైనల్‌ చేరాలని పట్టుదలతో ఉంది. అలాగే హైదరాబాద్‌ను ఓడించి ఐపీఎల్‌ తుది సమరానికి దూసుకెళ్లాలని శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని ఢిల్లీ ఆసక్తిగా ఉంది.

జట్ల వివరాలు:

ఢిల్లీ క్యాపిటల్స్‌: శిఖర్ ధావన్, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్‌మెయిర్, హర్షల్ పటేల్, మార్కుస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవి అశ్విన్, ప్రవీణ్ దుబే, అన్రిన్ నార్జీ, కాగిసో రబడ.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), శ్రీవత్స్ గోస్వామి (వికెట్ కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియంగార్గ్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి.నటరాజన్.

- Advertisement -