ఒలింపిక్స్‌…9వ స్థానంలో నిలిచిన దీపికా

171
tokyo
- Advertisement -

టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల ఆట ప్రారంభమైంది. తొలిరోజు ఆర్చరీ మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్ రౌండ్‌ పూర్తయింది. భారత ఆర్చర్‌ దీపికా కుమారి తొమ్మిదో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత ర్యాకింగ్స్‌లో 72 బాణాలు సంధించిన దీపికా.. మొత్తం 663 స్కోరు సాధించింది.

తొలి మూడు స్థానాల్లో దక్షిణ కొరియా ఆర్చర్లు నిలిచారు. దక్షిణ కొరియా క్రీడాకారిణి ఆన్‌ సాన్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆమె 680 స్కోరు సాధించింది. గతంలో తన పేరిటే ఉన్న రికార్డును ఆమె చెరిపివేసింది. 677 స్కోర్‌తో జంగ్‌ మిన్హే, 675 స్కోర్‌తో చయంగ్‌ కాంగ్‌ తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు.

- Advertisement -