టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ..

209
dc
- Advertisement -

ఐపీఎల్ 2020లో భాగంగా రాజస్ధాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్‌. ఒకేఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ స్టీవ్ స్మిత్ వెల్లడించారు. హర్షల్ పటేల్ స్ధానంలో తుషార్ దేశ్ పాండే తుది జట్టులోకి వచ్చాడని…అలాగే ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఓపెనర్‌గా వస్తాడని స్మిత్‌ వెల్లడించాడు.

పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్ధానంలో కొనసాగుతుండగా రాజస్ధాన్ చివరి నుండి రెండో స్ధానంలో ఉంది. ఢిల్లీకి ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లోగెలవడం ద్వారా ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగపరుచుకోవాలని భావిస్తుండగా రాజస్ధాన్ సైతం గెలిచి పరువు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

- Advertisement -