గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన దానం

502
danam nagender
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ఎమ్మెల్యే దానం నాగేందర్ . హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నే కవిత,బంజారాహిల్స్ పోలీస్ సిబ్బంది,కంగరో కిడ్స్ స్కూల్ చిన్నారులు ,టీచర్స్‌తో కలిసి మొక్కలునాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన దానం.. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ ను పెరుగుతున్న నేపథ్యంలో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం తీసుకోవడం అభినందనీయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్, సినీ నిర్మాత దిల్ రాజ్, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి,ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ నలుగురికి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు.

mla danam

- Advertisement -