లాభాల బాటలో ప్రైవేట్ రైలు…తేజస్ ఎక్స్‌ప్రెస్

432
- Advertisement -

గత సంవత్సరం అక్టోబర్ 4న దేశంలో తొలి ప్రైవేట్ రైలును తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. లక్నో-న్యూఢిల్లీ మధ్య నడిచే ఈ ప్రైవేట్ రైలును రైల్వేశాఖ అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) నిర్వహిస్తోంది.

సుమారు 80-85 శాతం యావరేజ్ ఆక్యుపెన్సీ రేషియోతో ఈ రైలు లాభాల బాటలో నడుస్తోంది. ఈ రైలుకు రెండు హాల్టులు (కాన్పూరు, ఘజియాబాద్) మాత్రమే ఉన్నాయి. మంగళవారం మినహా ప్రతిరోజూ రాకపోకలు సాగించనుంది. ఈ రైలులో ప్రయాణం ఆలస్యమైతే ప్రయాణికులకు గంటల చొప్పున పరిహారం చెల్లిస్తారు. ఇందులో ప్రయాణించేవారు రూ.25 లక్షల ఉచిత బీమా సౌకర్యం పొందొచ్చు.

- Advertisement -