మిగ్ జాం ఎఫెక్ట్..ఎడతెరపిలేని వర్షాలు

42
- Advertisement -

మిగ్ జాం ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని గంటల్లో తీరం దాటనుండగా బాపట్ల-దివిసీమ మధ్య అది తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే దాదాపు 150 రైళ్లను రద్దు చేసింది. మిగ్ జాం ప్రభావంతో హైదరాబాద్‌ వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుంది.

రాష్ట్రంలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కరీంనగర్‌, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. వరంగల్‌, హన్మకొండ, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీచేసింది.

Also Read:సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా

- Advertisement -