ఆపరేషన్‌ రోప్‌ మరింత జటిలం..

182
- Advertisement -

ఆపరేషన్‌ రోప్‌ ద్వారా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించిన పోలీసులు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే రూల్స్‌ పాటించని వాహనాదారులకు జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నల్స్‌ వద్ద సర్కిల్స్‌ వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1000, పాదాచారులకు అడ్డు కలిగించేలా వాహనాలు నిలిపితే రూ.600 ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే భారీ ఫైన్స్‌ విధిస్తున్న విషయం తెలిసిందే. ఆపరేషన్‌ రోప్‌ విజయవంతం కావడంతో పోలీసులు మరింత ట్రాఫిక్‌ను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు

ఇక నుండి కొత్తగా మరికొన్ని రూల్స్‌ను పాటించాలిన నిర్ణయించింది. ఇందులో భాగంగా రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్‌ చేస్తూ రూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 ఫైన్ వేయనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి రాంగ్‌రూట్‌, ట్రిపుల్‌ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నారు. ట్రాఫిక్‌ పోలీసులెవ్వరూ లేరు కదా అని ఇష్టానుసారంగా వాహనం నడిపినా.. ఎవరూ చూడడం లేదని నిబంధనలకు విరుద్ధంగా సిగ్నల్స్‌ జంప్‌ చేసినా సీసీ కెమెరాల్లో దృశ్యాలను బట్టి.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి…

ఈ-రేస్‌కు అద్భుత స్పందన

బూర్జ్‌ ఖలీఫాపై భేదియా ట్రైలర్…

దక్షిణాదిలో ప్రాంతీయ చిచ్చు…

- Advertisement -