వెబ్‌సిరీస్‌గా 2007నాటి పొట్టి జైత్రయాత్ర

330
- Advertisement -

భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగింది. కానీ 1983లో ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ను ఏవిధమైన అంచనాలు లేకుండా కప్‌ సాధించారు. నాటి జ్జాపకాలతో రణ్‌వీర్ సింగ్ హీరోగా 83 పేరుతో తెరకెక్కింది. కాగా తాజాగా 2007 టీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన టీమిండియా మీద వెబ్‌సిరీస్‌ రానుందని బాలీవుడ్‌ టాక్‌.

ప్రముఖ మార్కెట్ విశ్లేష‌కుడు, సినీ విమ‌ర్శ‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. టీమిండియా ఆట‌గాళ్లు పొట్టి ప్రపంచ‌క‌ప్ ట్రోఫీతో ఉన్న ఫొటోల్ని త‌ర‌ణ్ పోస్ట్ చేశాడు. ఇందులో 15 మంది భార‌త క్రికెట‌ర్లు, ఒక ఫేమ‌స్ యాక్ట‌ర్ న‌టిస్తున్నారు. ప‌లు భాష‌ల్లో రానున్న‌ ఈ వెబ్‌సిరీస్ టైటిల్ ఇంకా నిర్ణ‌యించ‌లేద‌ని, దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చింద‌ని, 2023లో ఈ వెబ్‌సిరీస్‌ని ఓటీటీలో విడుద‌ల చేస్తామ‌ని త‌ర‌ణ్ తెలిపాడు.

లండ‌న్‌కు చెందిన వ‌న్ వ‌న్ సిక్స్ నెట్‌వ‌ర్క్ అనే నిర్మాణ సంస్థ య‌జ‌మాని అనంద్ కుమార్ ఈ వెబ్ సిరీస్‌ని తీసుకొస్తున్నాడు. ఇత‌ను ఇంత‌కుముందు హిందీలో ఢిల్లీ హైట్స్, జిల్లా ఘ‌జియాబాద్ సినిమాలు తీశాడు.2007లో మొద‌టిసారిగా ఐసీసీ టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హించింది. ఈ పోటీల‌కు ద‌క్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చింది. ఎం.ఎస్.ధోనీ నాయ‌క‌త్వంలోని టీమిండియా ఫైన‌ల్లో పాకిస్థాన్ మీద ఐదు వికెట్ల తేడాతో విజ‌యం గెలిచి, పొట్టి ప్రంప‌చ‌క‌ప్ ఛాంపియ‌న్‌గా అవ‌త‌రించింది.

ఇవి కూడా చదవండి…

ఆదిపురుష్‌పై కృతి కామెంట్‌…

బాలయ్య ఉంగరాల ఫ్లాష్ బ్యాక్

ఈ-రేస్‌కు అద్భుత స్పందన

- Advertisement -