గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న సైబరాబాద్‌ కొత్త సీపీ స్టీఫెన్‌ రవీంద్ర..

391
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను సైబరాబాద్‌ కొత్త సీపీ స్టీఫెన్‌ రవీంద్ర స్వీకరించి మొక్కలు నాటారు. గురువారం సైబరాబాద్‌ కమిషనరేట్ ఆవరణలో ఆయన మొక్కన నాటి దానితో సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్బుతమని కొనియాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాగస్వామ్యం అయి మొక్కలు నాటే అవకాశం కలిగినందుకు ఎంపీ సంతొష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు ఎంపీ స్పందించి సీపీ స్టీఫెన్‌ రవీంద్రకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -