ముంబైకి వరుసగా ఏడో ఓటమి..

107
csk
- Advertisement -

ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా వరుసగా ఏడో ఓటమిని మూటగట్టుకుంది ముంబై. చెన్నైతో చివరి బంతివరకు ఉత్కంఠబరితంగా సాగిన పోరులో చెన్నై విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై7 వికెట్లు కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

చివరి ఓవర్‌లో 17 పరుగులు కావాల్సి ఉండగా తొలి రెండు బంతుల్లో ఒక్క పరుగుమాత్రమే వచ్చింది. ఇక చివరి నాలుగు బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా స్టైక్‌లో ఉన్న ధోని 6,4,2,4తో మ్యాచ్‌ను ముగించేశాడు. ధోనీ (13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28 నాటౌట్‌) పరుగులు చేయగా రాయుడు (40), ఊతప్ప (30) రాణించారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై…నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 155 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (51 నాటౌట్‌), సూర్యకుమార్‌ (32) రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ముకేష్‌ చౌధరి నిలిచాడు.

- Advertisement -