కేంద్ర బృందంతో సీఎస్ సోమేశ్‌ కుమార్ భేటీ..

154
somesh kumar
- Advertisement -

కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరి ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఇంటర్ మినిస్టీరియల్ బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ని ఈ రోజు ఉదయం బిఆర్ కెఆర్ భవన్ లో కలిసి రాష్ట్రంలో వరదల పరిస్ధితి, చేపడుతున్న సహాయక చర్యల పై చర్చించారు.

రాష్ట్రంలో వరదలు, వర్షాల వలన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ కమిటి రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి రాష్ట్రంలో ఆస్తులకు, పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుంది.

ఈ బృందంలో శ్రీ ప్రవీణ్ వశిష్ట తో పాటు శ్రీ ఆర్.బి. కౌల్, కన్సల్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, శ్రీ కె.మనోహరన్, డైరెక్టర్ వ్యవసాయశాఖ, శ్రీ ఎస్.కె. కుషువహా, ఎస్.ఈ రవాణాశాఖ, శ్రీ ఎమ్.రఘురామ్, ఎస్.ఈ కేంద్ర జలవనరుల శాఖ ఉన్నారు.

- Advertisement -