- Advertisement -
కరోనాతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మెగాస్టార్ చిరంజీవి. డియర్ శివాత్మిక .. మీ నాన్న, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ధైర్యంగా ఉండండి. అందరి ప్రార్ధనలతో రాజశేఖర్ త్వరగా కోలుకుంటారు. మీ కుటుంబం కోసం ప్రార్ధిస్తున్నాను అని చిరు పేర్కొన్నారు.
ఉదయం నుండి రాజశేఖర్ ఆరోగ్య పరిస్ధితిపై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వర్గాలతో పాటు రాజశేఖర్ కూతురు శివాత్మిక సైతం ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉందని తెలిపింది. తన తండ్రి క్షేమంగా రావాలని , ఇందుకోసం అందరు ప్రార్ధనలు చేయండని శివాత్మిక ట్వీట్ చేయగా స్పందించారు చిరంజీవి.
- Advertisement -