ఉపాధ్యాయ సంఘాలతో సీఎస్‌ కీలక భేటీ..

180
- Advertisement -

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. జీ.ఓ. నెంబర్ 317 అమలుపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ బదిలీల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చీఫ్ సెక్రటరీని కోరగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని సి.ఎస్. సోమేశ్ కుమార్ వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రంగారెడ్డి కలెక్టర్ ఆమాయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, తిరుపతి రావులు ఉన్నారు.

- Advertisement -