తప్పుడు ప్రచారం చేస్తే..క్రిమినల్ చర్యలు:సీపీ అంజనీకుమార్

211
cp anjani kumar
- Advertisement -

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారిని చెప్పారు. ఒకే రోజు 92 మంది పోలీసులుపై సీపీ చర్యలు తీసుకున్నారనే ప్రచారం అవాస్తవమని తెలిపారు.

ఇది తప్పుడు ప్రచారమని.. నగరంలో ఒకేరోజు 92 మంది పోలీసు అధికారుల సస్పెన్షన్‌ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్నారు.

- Advertisement -