పవన్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్ డేట్స్

36
- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయి తేజ్ న‌టిస్తున్న ఫాంట‌సీ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ బ్రో. స‌ముద్ర‌ఖని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా జులై 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో ప్ర‌మోష‌న్స్‌ని వేగ‌వంతం చేసిన మేక‌ర్స్ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ మై డియ‌ర్ మార్కండేయ సాంగ్ గురించి అప్డేట్ ఇచ్చారు. త్వ‌ర‌లోనే ఈ సాంగ్ రిలీజ్ కానున్న‌ట్లు కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేస్తూ వెల్ల‌డించారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లోకి అగుడు పెట్టిన విషయం తెలిసిందే.

పవర్ స్టార్ ఒక్క పోస్టు పెట్టకపోయినా ఫాలోవర్స్ మాత్రం లక్షల సంఖ్యలో చేరుతున్నారు. కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 1.7 మిలియన్ల ఫాలోవర్స్ పవన్ ఖాతాలో చేరారు. ఇక ఈరోజు ఆ సంఖ్య 2 మిలియన్లకు చేరింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ‘ఇది కదా పవన్ కల్యాణ్ క్రేజ్ అంటే’ కామెంట్లు పెడుతున్నారు. అన్నట్టు యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ కళ్యాణ్ చేస్తున్న సినిమా ఓజీ. ప్ర‌స్తుతం ప‌వ‌న్ లేని స‌న్నివేశాల‌పై షూటింగ్ చేస్తున్నారు.

Also Read:‘థ్రెడ్స్’లో స్టార్ హీరోల మధ్య పోటీ

కాగా దర్శకుడు సుజీత్, జులై రెండో వారంలో ప‌వ‌న్‌తో షూట్‌కి వెళ్దామ‌నుకున్నాడు. కానీ, ప‌వ‌న్ వారాహి యాత్ర‌ను మ‌ళ్లీ మొద‌లుపెట్ట‌డంతో ఓజీకి డేట్స్ ఇవ్వ‌నట్లే క‌నిపిస్తున్నాడు. లేదంటే వారాహి యాత్ర‌కు గ్యాప్ వ‌చ్చిన‌ప్పుడు, ఆ టైమ్‌కు ఓజీ షూటింగ్‌కు కేటాయిస్తాడేమో చూడాలి. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ పై నిత్యం అనేక రూమర్లు వస్తూనే ఉన్నాయి.

Also Read:గుజరాత్ హైకోర్టులో రాహుల్‌కి నిరాశే

- Advertisement -