వీరజవాన్లకు నివాళి: సీపీ సజ్జనార్

107
sajjanar
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన జవాన్లకు తెలంగాణ పోలీస్ శాఖ నివాళులర్పించింది. అమరులైన వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్.

నక్సలిజం సమసిపోయినా.. అక్కడక్కడ కొన్ని ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, వీర జవాన్లు అమరులైనప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో పోరాడి వారి ఆశయాన్ని నెరవేరుస్తామని సజ్జనార్ పేర్కొన్నారు. అమరులైన వీర జవాన్ల కుటుంబ సభ్యులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సిఆర్పీఎఫ్ అధికారులు అన్ని విధాలా ఆదుకుంటారని అన్నారు.

- Advertisement -