గజ్వేల్ కాలువలోకి కాళేశ్వర జలాలు విడుదల..

284
kcr
- Advertisement -

గజ్వేల్ పర్యటనలో భాగంగా మర్కూక్ మండలం పాములపర్తి వద్ద గజ్వేల్ కాలువలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు సీఎం కేసీఆర్. అంతకముందు కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్‌ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ కాల్వలోకి విడుదల చేశారు. నీటి విడుద‌ల సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హ‌రీష్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -