ప్రజలు బయటకు రావొద్దు: సీపీ అంజనీ కుమార్

221
cp
- Advertisement -

ప్రజలు ఇళ్లను విడిచి బయటకు రావొద్దన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. రాష్ట్రంలో లాక్ డౌన్ రెండో రోజుకు చేరుకున్న సందర్భంగా సమీక్ష నిర్వహించిన సీపీ అంజనీ కుమార్… లాక్ డౌన్ ను ప్రజలు కచ్చితంగా పాటించాలని అన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేసినట్టు అంజనీకుమార్ పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు.

రంజాన్ సందర్భంగా ప్రజలు ఇళ్లల్లోనే ప్రార్ధనలు జరుపుకోవాలని….. మసీదులో మౌలానాతో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఇంట్లో జరిగే ప్రార్థనల్లో కూడా సామాజిక దూరం పాటించాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 1800 మందిపై కేసులు పెట్టినట్టు సీపీ పేర్కొన్నారు.

- Advertisement -