లక్షా 45 వేలకు చేరిన కరోనా కేసులు..

184
coronaviurs
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఓ వైపు కేంద్రం విధించిన లాక్ డౌన్ 4.0 గడువు మే 31తో ముగుస్తున్న నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,45,380కి చేరగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6535 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇందులో 80,722 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 60490 మంది కోలుకున్నారు. కరోనాతో దేశంలో ఇప్పటివరకు 4167 మంది మృతిచెందారు.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 52667 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 1695 మంది మృతిచెందారు. తమిళనాడులో 17082 కేసులు నమోదుకాగా 118 మంది మరణించారు. గుజరాత్‌లో 14468 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 888 మంది చనిపోయారు.

- Advertisement -