ఐపీఎల్‌ విజేతగా ఆర్సీబీ..!

295
ipl
- Advertisement -

కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 2020 వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారీ విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. అదే ఇండియన్ పోల్ లీగ్‌(ఐపీఎల్‌)ని గెలుచుకుంది ఆర్సీబీ.

ఐపీఎల్ వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ఆర్సీబీ వినూత్నంగా ఆలోచించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ఇండియన్ పోల్ లీగ్‌ను నిర్వహించింది.

ఈ పోల్‌లో అత్యధిక ఓట్లు సాధించిన జట్టుగా ఆ మ్యాచ్‌లో గెలిచినట్లు. ఇలా షెడ్యూల్‌ ప్రకారం జరిగాల్సిన మ్యాచ్‌లకు పోల్‌ నిర్వహించి ఇండియన్‌ పోల్‌ లీగ్‌ను ఆర్బీబీ ఫైనల్‌ వరుకు నిర్విరామంగా కొనసాగించింది. ఇలా సన్‌రైజర్స్‌, ఆర్సీబీ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ ఫైనల్లో 85 శాతం ఓట్లతో ఆర్సీబీ విజయం సాధించింది.

- Advertisement -