మీసం మెలేసిన రాహుల్‌…

249
- Advertisement -

భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ ముందుకెళ్లుతొంది. ఈ సందర్భంగా భారత బాక్సర్‌విజయేందర్ సింగ్ తో కలిసి కాంగ్రెస్ నేత రాహుల్‌ మీసాలు తిప్పి అలరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో పాదయాత్ర చేసిన రాహుల్‌ నేడు ఖార్గోన్ జిల్లాలో కొనసాగిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

తమిళనాడు కర్ణాటక ఏపీ తెలంగాణ మహారాష్ట్రలో ఆయన పాదయాత్ర ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని రైతులు కార్మికులు విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా రాహుల్ మీసాలు మెలితిప్పడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కాగా ఇప్పటికే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ రాహుల్‌ను ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్‌తో పోల్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ ఎక్కడో తెలుసా…

ఎమ్మెల్యేల కొనుగోలు..నిందితుల రిమాండ్ పొడగింపు

అభివృద్ధి చేసి చూపించండి..బీజేపీకి గుత్తా సవాల్

- Advertisement -