అభివృద్ధి చేసి చూపించండి..బీజేపీకి గుత్తా సవాల్

132
gutha
- Advertisement -

ఐటీ, ఈడీ, సీబీఐలతో బీజేపీ యేతర నాయకులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన గుత్తా..రాష్ట్రంపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. ఆర్థిక వనరులను కట్టడి చేయాలనే దురాలోచనలో ఉందని చెప్పారు. ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించే చర్య అని ఫైరయ్యారు. జీఎస్టీలో రాష్ట్రానికి రావలసిన వాటా ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర వైఖరి మారాలని సూచించారు.

రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ ఎంతకైనా తేగించెలా ఉందని…కేంద్ర తన పరిధిలో ఉన్న అన్ని శాఖలతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నదని, వ్యక్తిగత కక్షకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే అభివృద్ధి చేసి చూపించాలని సవాల్ విసిరారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -