భారీ వర్షాలు..అప్రమత్తంగా ఉండండి: సీఎండీ ప్రభాకర్ రావు

221
cmd prabhakar rao
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, ఇంజనీర్స్ ను అప్రమత్తం చేశారు ట్రాన్స్ కో ,జెన్కో సిఎండి ప్రభకార్ రావు.నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయింది. విద్యుత్ డిమాండ్ 12 వేల మెగా వాట్స్ నుండి 4300 మెగావాట్స్ పడిపోయింది.

దీనితో పెరిగిన వోల్టేజ్ అప్రమత్తమైన విద్యుత్ అధికారులు.యధావిధిగా కొనసాగుతున్న 15 వందల మెగా వాట్స్ హైడల్ విద్యుత్ ఉత్పత్తి అధికారులను ,ఇంజనీర్స్ అప్రమత్తంగా ఉండాలని అదేశించారు ప్రభాకర్ రావు.విద్యుత్ డిమాండ్ లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో రాత్రి నుండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తు లోడ్ డిస్స్పాచ్ చేస్తున్న సీఎండీ…విద్యుత్ డిమాండ్ తగ్గడం థర్మల్ యూనిట్స్ అన్ని బ్యాక్ డౌన్ చేశామని తెలిపారు.

వర్షం నీరు నిల్వ ఉన్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థ కు తెలియజేయాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడిన ,సెల్లార్ లకు నీళ్లు వచ్చిన దయచేసి ప్రజలు 1912 / 100 స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి తెలపాలని ప్రజలకు సూచించారు. ఎక్కడైనా వర్షము నీరు సెల్లార్ లోకి వస్తే పవర్ సప్లై ఆఫ్ చేసుకోండి ఎందుకంటే షాట్ సర్క్యూట్ కాకుండా ఉంటుందన్నారు.

- Advertisement -