మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్‌కు కరోనా…

170
shivrajsingh chowhan
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల 13 లక్షలు దాటగా ఇప్పటివరకు 31,358 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు కరోనా సోకింది. దీంతో క‌రోనా ప‌రీక్ష ల‌క్ష‌ణాలు క‌న్పించ‌డంతో ప‌రీక్ష చేయించుకున్నాన‌ని, అందులో పాజిటివ్‌గా వ‌చ్చింద‌ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనను కాంటాక్ట్ అయిన వారంతా టెస్టులు చేయించుకోవాలని ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని వెల్లడించారు.

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా 48,916 పాజిటివ్ కేసులు న‌మోవ‌ద‌గా, 757 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 13,36,861కు చేర‌గా, మృతుల సంఖ్య 31,358కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్‌ కేసుల్లో 4,56,071 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 8,49,431 మంది బాధితులు కోలుకున్నారు.

- Advertisement -