CM KCR:శ్రీవిట్టల్‌ రుక్మిణీ ఆలయంలో ప్రత్యేక పూజలు

37
- Advertisement -

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా రెండో రోజు సోలాపూర్‌ నుండి పండరీపూర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్..శ్రీవిట్టల్ రుక్మిణీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్ని ఆలయానికి చేరుకున్న సీఎం..ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు,డీ దామోదర్ రావు,మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

May be an image of 6 people, dais and temple

Also Read:ప్రతిరోజూ సైకిల్ తొక్కితే..ఎన్ని లాభాలో!

మధ్యాహ్నం మూడు గంట‌ల‌కు శ‌క్తిపీఠం తుల్జాపూర్ భ‌వానీ ఆల‌యానికి వెళ్లి అమ్మవారిని ద‌ర్శించుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మహారాష్ట్రలోని భార‌త రాష్ట్ర స‌మితి కార్యక‌ర్తలు భారీ స్థాయిలో పండ‌రీపురం చేరుకున్నారు.

Also Read:మొక్కజొన్న పీచుతో ఆరోగ్య ప్రయోజనాలు..!

- Advertisement -