పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్, సీఎం

125
kcr
- Advertisement -

హైదరాబాద్ పీవీ ఘాట్‌లో మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహరావు శతజయంతి ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా గవర్నర్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయ‌న విగ్ర‌హానికి గ‌వ‌ర్న‌ర్, సీఎం కేసీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల ఎత్తులో పీవీ కాంస్య విగ్ర‌హాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే నెక్లెస్‌ రోడ్‌కు పీవీ మార్గ్‌గా నామకరణం చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -