శ్రీరంగనాథ స్వామి సన్నిధిలో సీఎం కేసీఆర్..

92
kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ ఇవాళ తమిళనాడులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరి బేగంపేటకు చేరుకుంటారు. 11.10కి ప్రత్యేక విమానంలో బయలుదేరి 12.30కు తమిళనాడులోని తిరుచి చేరుకుంటారు.

మధ్యాహ్నం 2.10కి ఆయన రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. 3 గంటలకు తిరుచి విమానాశ్రయానికి పయనమవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుని, ఐటీసీ గ్రాండ్‌ చోళలో బస చేస్తారు. మాజీ గవర్నర్‌ నరసింహన్‌ను కలుస్తారు.

అనంతరం రాత్రి చైన్నైలోనే బస చేయనున్న సీఎం కేసీఆర్….రేపు తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై స్టాలిన్‌తో చర్చించనున్నారు.

- Advertisement -