మంత్రులు, ఎమ్మెల్యేల‌కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం..

121
cm kcr
- Advertisement -

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు కుమార్తె వాణీదేవి పేరును సీఎం కేసీఆర్ ఖ‌రారు చేసిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో వాణీదేవి ఈరోజు నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. వాణీదేవి నామినేష‌న్ దాఖ‌లు కంటే ముందు ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ఈ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేల‌తో భేటీ కానున్నారు. ఈ స‌మావేశానికి వాణీదేవి కూడా హాజ‌రు కానుంది.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై మంత్రులు, ఎమ్మెల్యేల‌కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయ‌నున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈ నెల 23 తుది గడువు. మార్చి 14న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించారు.

- Advertisement -