రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టండి: సీఎం కేసీఆర్

130
kcr
- Advertisement -

రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలన్నారు.

మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో గొర్రెల పంపిణీకి సంబంధించి నిధులు కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టగా మొదటి విడత చివరి దశలో కరోనా వల్ల పంపిణీ నిలిచిపోయింది. దాదాపు 30 వేల మందికి పైగా డీడీలు కట్టి ఉన్నారు.

- Advertisement -