మారిన లంబాడి తండా రూపురేఖలు: కేటీఆర్

156
ktr
- Advertisement -

పండుగ వాతావరణంలో లంబడి తండాలో డబుల్ బెడ్ రూంలు అడబిడ్డలకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు అందచేసే కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్….గ్రేటర్ పరిధిలో 18 వేల కోట్ల రూపాయలతో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు.

28 రాష్ట్రాలలో ఎక్కడ ఇలా ఇల్లు ఇవ్వడం లేదని.. విలువైన ఇళ్ళు ఇవాళ ప్రజల చేతికి అందిస్తున్నామని పేర్కొన్నారు. 40-50 లక్షల విలువ మార్కెట్ లో ఉంటుందని…అటువంటి డబుల్ బెడ్ రూమ్ లు లబ్దిదారులకు ఇస్తున్నామని తెలిపారు. ఈ ఇండ్లు కిరాయికి ఇవ్వవద్దు…అమ్మవద్దు …ఒక వేళ అలా చేస్తే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఎన్నికల అప్పుడు మాత్రమే రాజకీయాలు అని తెలిపిన కేటీఆర్…ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం కలసి పనిచేద్దామని…హుందాగా రాజకీయాలు చేద్దామన్నారు.

- Advertisement -