- Advertisement -
సీఎం కేసీఆర్ ఈరోజు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు, రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్తో ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్, బడ్జెట్ సమావేశాల నిర్వహణ తదితర విషయాలపై సీఎం వీరితో సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశంలో బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశముందని సమాచారం.
- Advertisement -