వ్య‌వ‌సాయ‌ శాఖ‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

264
cm kcr
- Advertisement -

యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలు చేయడంపై ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నరు. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభయ్యే సమావేశంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొంటారు.

కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటోంది. దీని వల్ల దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మక్కలను పండించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తలను కోనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.

- Advertisement -