రాష్ట్రంలో 24 గంటల్లో 1,811 కరోనా కేసులు..

140
telangana corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2,10,346కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 26,104 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 1,83,025 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1217 మంది మృతి చెందారు.

కరోనా మరణాల రేటు దేశవ్యాప్తంగా 1.5 శాతంగా ఉంటే.. తెలంగాణలో 0.57 శాతంగా ఉంది. ఇక కరోనా రికవరీ రేటు దేశంలో 85.7 శాతంగా ఉంటే.. తెలంగాణలో 86.01 శాతంగా ఉంది.

- Advertisement -