ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్..

104
- Advertisement -

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. కేసీఆర్ వెంట ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ప్ర‌త్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన విష‌యం తెలిసిందే.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ నెల 25న‌ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కేసీఆర్ స‌మావేశం కానున్నారు. 26న విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తీవ్రవాద ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమవుతారు. అదే రోజు సాయంత్రం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.

- Advertisement -