ప్రధాని తల్లి మృతి..సీఎం కేసీఆర్, ప్రముఖుల సంతాపం

24
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరా బెన్ మోడీ(100) ఇవాళ ఉదయం మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరా బెన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతిపట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌,నిరంజన్ రెడ్డి సంతాపం తెలిపారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్‌, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, కేంద్ర మాజీ మంత్రి, డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ చైర్మన్‌ గులాం నబీ ఆజాద్‌ సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -