బూర్గుల మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

141
CM KCR
- Advertisement -

కమ్యూనిస్టు నేత,తెలంగాణ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నో కమ్యూనిస్టు, ప్రగతిశీల ఉద్యమాలను బూర్గుల నర్సింగరావు ముందుండి నడిపించారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ, తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లోనూ నర్సింగ రావు పాత్ర మరువలేనిదన్నారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు.

- Advertisement -