ఢిల్లీలో టీఆర్ఎస్ భ‌వ‌న్‌కు శంకుస్థాప‌న చేసిన సీఎం కేసీఆర్..

211
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రో ప్ర‌స్థానానికి నాంది ప‌లికారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ కార్యాల‌యానికి ఈరోజు శంకుస్థాప‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన భూమి పూజ‌లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయ‌నతో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌తినిధులు ఆ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణ మ‌ధ్య భూమి పూజ నిర్వ‌హించారు. తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణం కోసం శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని వ‌సంత్ విహార్‌లో చేప‌ట్టారు.

- Advertisement -