సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా..

352
kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. రాష్ట్రంలో కరోనా పరిస్ధితి సహా కరీంనగర్‌లో జరుగుతున్న వైద్య ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం కేసీఆర్. కరీంనగర్ లో జరుగుతున్న ఏర్పాట్ల విషయంలో అధికారులు సీఎం కేసీఆర్‌కు భరోనివ్వడమే కాకుండా, పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు. దీంతో కరీంనగర్ పర్యటనను వాయిదా వేసుకున్నారు సీఎం.

ఇక తెలంగాణలో కరోనా కేసులు 19కి చేరాయి. ఢిల్లీ నుంచి తెలంగాణలోని కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా బృందంలో కరోనా సోకిన వారిసంఖ్య 10కి చేరింది. తాజాగా కరోనా పాజిటివ్ తేలిన వారిలో ఇండోనేషియా నుంచి వచ్చిన బృందంలోని 27 ఏళ్ల యువకుడితో పాటు 60 ఏళ్ల మరో వ్యక్తి ఉన్నాడు. వీరందరినీ గాంధీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఇక తెలంగాణలో నమోదైన కరోనా కేసులన్ని విదేశాల నుండి వచ్చినవారివే. స్ధానికులేవరికి కరోనా సోకలేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

- Advertisement -