తెలంగాణలో 19కి చేరిన కరోనా కేసులు

405
telangana corona
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసులు 19కి చేరాయి. శుక్రవారం ఒక్కరోజే 3 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ముగ్గురు బాధితులు కూడా విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. అంతేకాకుండా వీరిలో ఇద్దరు ఇండోనేషియా బృందానికి చెందినవారే.

ఢిల్లీ నుంచి తెలంగాణలోని కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా బృందంలో కరోనా సోకిన వారిసంఖ్య 10కి చేరింది. తాజాగా కరోనా పాజిటివ్ తేలిన వారిలో 27 ఏళ్ల యువకుడితో పాటు 60 ఏళ్ల మరో వ్యక్తి ఉన్నాడు. వీరందరినీ గాంధీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

18 ఏళ్ల యువతి కరోనా బారిన పడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన ఈమె ఇటీవలే లండన్ నుంచి తిరిగొచ్చింది. దగ్గు, జలుబు లక్షణాలతో కొద్ది రోజుల కిందట నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. యువతి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే.. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో విదేశాల నుండి వచ్చిన వారికి తప్ప స్ధానిక ప్రజలకు ఎవరికి కరోనా సోకలేదన్నారు. కరోనా పాజిటివ్ కేసుల్లో ఒక్కరికీ సీరియస్‌గా లేదని.. బాధితులందరూ కోలుకుంటున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

- Advertisement -