రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్…

100
kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు సాయంత్రం హస్తినకు వెళ్లనున్నారు. కేంద్రం హోంమంత్రి అమిత్‌షా తో పాటు పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.

ఈనెల 26న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంశాఖ అమిత్‌షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు.

ఇక రేపు అసెంబ్లీ సమావేశం మొదటి రోజు వాయిదాపడ్డ తర్వాత రేపు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -