ఎవ‌డైనా మొగోడు రుజువు చేస్తే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తా- కేసీఆర్‌

162
kcr
- Advertisement -

ఈరోజు జ‌న‌గామ జిల్లాలోని కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించి ప్ర‌సంగించారు. దుబ్బాక‌లో ఉప ఎన్నిక జ‌రుగుతుంది. అక్కడ బీజేపీ నాయ‌కులు చేస్తున్న అసత్య ప్రచారలపై కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. అక్క‌డ బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.. పీకేది లేదు. అక్క‌డ టీఆర్ఎస్ పార్టీ బ్ర‌హ్మాండంగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయ‌కులు ఝూట మాటలు మాట్లాడుతున్నారు. పెన్ష‌న్ల విష‌యంలో బీజేపీ నాయ‌కులు చేస్తున్న అస‌త్య ప్ర‌చారాల‌ను సీఎం ఖండించారు. పెన్ష‌న్ల‌కు కేంద్రం అధిక మొత్తంలో డ‌బ్బులు చెల్లిస్తుంద‌ని చెబుతున్నారు. ఒక వేళ దాన్ని బీజేపీ నాయకులు ఎవరైనా నిరూపిస్తే నా సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తా అని సీఎం కేసీఆర్ స‌వాల్ విసిరారు.

మ‌న రాష్ర్టంలో 38 లక్షల మందికి అన్ని ర‌కాల పెన్ష‌న్లు ఇస్తున్నాం. అంద‌రికీ నెల రాగానే పెన్ష‌న్లు ఇస్తున్నాం. ఈ పెన్ష‌న్ల‌లో కేంద్రం కేవ‌లం 7 ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే ఇస్తుంది. మ‌నిషికి 200 మాత్ర‌మే కేంద్రం ఇస్తుంది. సంవ‌త్స‌రానికి క‌లిపి కేంద్రం ఇచ్చేది రూ. 105 కోట్లు మాత్ర‌మే. రాష్ర్టం రూ. 10 వేల కోట్ల‌ నుంచి 11 వేల కోట్లు ఇస్తుంది. ఈ విష‌యాల‌న్నీ ప్ర‌జ‌లంద‌రికీ తెలియాలి. ఓట్ల కోసం బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నారు. వారికి ఓట్లు మాత్ర‌మే కావాలి అని సీఎం కేసీఆర్‌ దుయ్యబట్టారు. ఒక వేళ తాను చెప్పేది అబ‌ద్ధ‌మే అయితే, ఎవ‌డ‌న్న మొగోడు రుజువు చేస్తే తాను ఒక్క‌టే నిమిషంలో ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి ఇంటికి పోతాను అని సవాల్‌ చేశారు.

- Advertisement -