గ్రీన్ ఛాలెంజ్ స్ఫూర్తితో మొక్కలు నాటిన ప్రభాస్ ఫ్యాన్స్..

204
Prabhas Fans
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ అడవి దత్తతను స్ఫూర్తిగా తీసుకొని నేడు బెంగళూరు పట్టణంలోని డైరీ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ కిడ్వాయి క్యాన్సర్ హాస్పిటల్ నందు ఖాళీ ప్రదేశంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక (PFAK) ఆధ్వర్యంలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలతో చిన్న దట్టమైన అడవిని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక (PFAK) అధ్యక్షులు మరియు వ్యవస్థాపక అధ్యక్షులు రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో మా అభిమాన నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొని మొక్కలు నాటడమే కాకుండా పదహారు వందల ఎకరాల అడవిని దత్తత తీసుకొని దాని అభివృద్ధి కోసం ఐదు కోట్ల రూపాయలను అందించడం జరిగిందని దానిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేడు బెంగుళూరు పట్టణంలోని డైరీ సర్కిల్ వద్ద ప్రభుత్వ కిడ్వాయి క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో దాదాపు 10000 Sft ఖాళీ ప్రదేశంలో ఔషధ గుణాలు కలిగి క్యాన్సర్‌ను నియంత్రించే మొక్కలు అదేవిధంగా దోమలను నియంత్రించే దాదాపు 180 మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు.

ఈరోజు మేము నాటిన మొక్కలు పెరిగి పెద్దయిన తర్వాత హాస్పిటల్ నందు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఔషధ గుణాలు కలిగిన ఆక్సిజన్ తీసుకోవడం ద్వారా వ్యాధి నయం అవుతుందని అదేవిధంగా హాస్పటల్ ప్రాంగణంలో దోమలు లేకుండా ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మేము ప్రతి సంవత్సరము మా అభిమాన నటులు ప్రభాస్‌ను, కృష్ణం రాజు గారిని స్ఫూర్తిగా తీసుకొని వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఈ సంవత్సరం హాస్పటల్ ప్రాంగణంలో అడవిని ఏర్పాటు చేసి దాని అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.

దీనివలన రోగులకే కాకుండా హాస్పిటల్ కి వచ్చే వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. మేము ఈ చేపట్టే ఈ కార్యక్రమానికి మా వెంట ఉన్న కిడ్వాయి హాస్పిటల్ వారికి ఇండియన్ హెర్బ్స్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా పార స్విమ్మర్ నిరంజన్ ముకుందన్ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక అధ్యక్షులు అశ్విన్ రెడ్డి, కార్యదర్శి ఆశిక్, హాస్పిటల్ పిఆర్వో బసప్ప, ఇండియన్ హెర్బ్స్ పౌండర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -