సీఎం కేసీఆర్‌కు రాఖీలు కట్టిన సోద‌రీమ‌ణులు..

192
- Advertisement -

దేశవ్యప్తంగా ఈరోజు ర‌క్షాబంధ‌న్ వేడుక‌లు వైభవంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ నివాసం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ర‌క్షాబంధ‌న్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. కేసీఆర్‌కు ఆయ‌న సోద‌రీమ‌ణులు రాఖీలు క‌ట్టారు. సీఎం అక్కాచెల్లెళ్లు ల‌క్ష్మ‌మ్మ‌, జ‌య‌మ్మ‌, ల‌లిత‌మ్మ ముగ్గురు క‌లిసి కేసీఆర్‌కు హార‌తి ప‌ట్టి, రాఖీలు క‌ట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వ‌దించారు.

అలాగే సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు తన సోదరి అలేఖ్య రాఖీ కట్టింది. ఈ రాఖీ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -