‘మా’ మీటింగ్‌లో మోహన్ బాబు సంచలన కామెంట్స్‌..!

135
mohan babu
- Advertisement -

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలపై ఆసక్తికరంగా మరిన విషయం తెలిసిందే. ఎన్నికలపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. కరోనా పరిస్థితుల రీత్యా వర్చువల్‌గా నిర్వహించిన ఈ సమావేశంలో నటుడు మోహన్‌బాబు ప్రశ్నల వర్షం కురిపించారు.

“భవనం కోసం స్థలం కొన్నారు.. అమ్మేశారు. రూపాయికి కొన్న స్థలాన్ని అర్ధరూపాయికి అమ్మేశారు. ఇది ఎంతవరకు సబబు? దాని గురించి ఎవరైనా మాట్లాడారా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. ‘మా’కు సొంత భవనం కోసం కేటాయించిన సొమ్ముతో స్థలం కొని దాన్ని సగం ధరకే అమ్మేయడంపై సినీ పెద్దలు ఆలోచించాలి” అని వ్యాఖ్యానించారు.

- Advertisement -